సిరాన్యూస్, ఖానాపూర్
50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో బ్లూ కోట్ , పెట్రో కార్ విధులు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా అనుమనాస్పదముగా వస్తున్న మహీంద్రా మిని డీసీఎం వాహనాన్ని కొమురం భీమ్ చౌరస్తా వద్ద నిలిపివేశారు. వాహనం తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రములు లేని సుమారు 50 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుబడ్డాయి. ఈ పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న సంగ , వెంకటేష్ ,గొల్ల జలపతి వారిపై కేసు నమోదు చేసినట్లు ఖానాపూర్ ఎస్సై జి. లింబద్రి తెలిపారు.