సిరా న్యూస్,హైదరాబాద్;
చలో అసెంబ్లీకి పిడిఎస్యు పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను తక్షణమే విడుదల చేయాలి. విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టాలని అసెంబ్లీ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది . పోలీసులు వారిని అడ్డుకొని ఎక్కడికి అక్కడ అరెస్టులు చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. యూనివర్సిటీలలో రెగ్యులర్ విసీ లను నియమించాలి. నీట్ బాధితులకు న్యాయం చేయాలి నీట్ పరీక్షల నిర్వహణ రాష్ట్రానికి ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి బోధన బోధనేతర పోస్టింగ్లు అన్నిటిని కూడా పూర్తి చేయాలి. యూనివర్సిటీలలో సదుపాయాల నిమిత్తం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ధర్నాకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకొని అక్కడికక్కడ అరెస్టులు చేసి తరలించారు.