భూపాలపల్లిలో ప్రశాంతంగా పోలింగ్

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

 సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా అన్నారు. ఉదయం నుండి ఓటర్ల చైతన్యం వెల్లివిరుస్తున్నదని అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓటు హక్కు వినియోగానికి సమయం ఉన్నదని, సమయం మించిపోయే వరకు ఓటర్లు వేచి ఉండక, పోలింగ్ కేంద్రాలకు విచ్చేసి ఓటు హక్కును వినియోగించు కోవాలని ఆయన సూచించారు. కలెక్టరేట్ కార్యాలయపు సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము నుండి పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్, సి సి కెమెరాలు ద్వారా పరిశీలిస్తూ సత్వర ఓటింగ్ జరిగేందుకు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు రద్దీ నియంత్రణ చర్యలు తదితర అంశాలపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.
============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *