సిరా న్యూస్;
మయూరాన్ని ఎంపిక చేసి నేటికి 61 ఏళ్లు
నెమలి చాలా అందమైన పక్షి, నెమలికి చాలా పొడవైన అతి అందమైన రంగురంగుల తోక ఉంటుంది. తన తోకను పూర్తిగా విసనకర్ర మాదిరిగా తెరిచి, నాట్యం చేస్తుంటే నెమలి ఎంతో రాజసంగా కనిపిస్తుంది. జాతీయ పక్షి హోదాకు తగినట్లుగానే కనిపిస్తుంది. 4 అడుగుల పొడవు ఉండే ఈ తోకలో ఆకుపచ్చని ఈకలు వాటి మధ్యలో నీలపు రంగు కళ్ళు, కళ్ళ చుట్టు రాగి మరియు గోధుమ రంగు మిశ్రపు అంచులు ఉంటాయి. నెమలి శరీరం ఆకుపచ్చ, నీలం రంగుల మిశ్రమం లో ఉంటుంది. దీని తల మీద కిరీటం లాంటి పించం (కుచ్చు) ఉంటుంది. పొడవాటి తోక మాత్రం మగపక్షికీ ఉండడం మరో విశేషం. ఆడ నెమలి గోధుమ రంగులో ఉండి నీలం, ఆకుపచ్చ మచ్చలు హృదయ భాగంలో కలిగి ఉంటుంది. విశ్వంలోని అందాన్నంతా తనలో దాచుకున్న నెమలిని భారతప్రభుత్వం జాతీయ పక్షిగా ప్రకటించింది. 1963లో జనవరి 31న ఈ ప్రకటన జరిగింది. అంటే నేటికి సరిగ్గా 61ఏళ్లు పూర్తైందన్న మాట.. ఈ సందర్భంగా ఆ మయూరం గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి.రానురాను తగ్గుతూ వస్తున్న నెమళ్ల సంఖ్య. 2011తో పోలిస్తే ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో జీవిస్తున్న నెమళ్లు. వేటగాళ్ల దెబ్బకు నెలకు దాదాపు 10 నుంచి 20 నెమళ్లు ప్రాణాలు విడుస్తున్నాయి.నెమళ్లు సాధారణంగా అటవీప్రాంతంలో 20సంవత్సరాలు బతుకుతాయి. వీటిన ప్రత్యేక శ్రద్ధతో పెంచితే.. 40 నుంచి 50 సంవత్సరాలు ఢోకా లేకుండా చక్కగా జీవనకాలాన్ని పెంచొచ్చు.కొన్ని నెమళ్లు తెలుపు రంగులోనూ ఉంటాయి. వీటినే శ్వేత మయూరాలంటారు.ఆహారంగా ధాన్యపు గింజలు, పండ్లు, క్రిమికీటకాలు, చిన్నపాములు, పురుగులను తీసుకునే నెమళ్లు.ఆడ నెమళ్లు 96 సెంటీమీటర్ల దాకా పొడవు, 4 కిలోల బరువు ఉంటాయి.మగ నెమళ్లు 2. 12 మీటర్ల పొడవు, 5 కిలోలకు పైగా బరువుంటాయి.ఆడనెమళ్లు రెండేళ్ల నుంచి రోజుకొక గుడ్డు 10రోజుల పాటు పెడతాయి.గుడ్లని పొదగడానికి 30 రోజుల సమయం తీసుకుంటాయి.వేసవిలో మాత్రం నెమలికి ఈకలు రాలిపోవడమే కాకుండా గుడ్లను పొదిగే అవకాశం కూడా ఉండదు.