ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
సిరా న్యూస్,పెద్దపల్లి;
మండలంలోని నిమ్మనపల్లి, నిట్టూరు, తుర్కల మద్దికుంట, కాసులపల్లి, పాలితం, గోపయ్యపల్లి గ్రామాలలో సోమవారం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను చిత్త శుద్ధితో అమలు చేస్తుందో ఈ పార్లమెంటు ఎన్నికల లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మన కోసం 5 న్యాయ గ్యారంటీలు అయిన రైతులందరికీ కనీస మద్దతు ధర , ఉపాది హామీ కూలీలకు రోజుకు రూ. 400 పెంపు, ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా లక్ష రూపాయలు, రూ. 25 లక్షల వరకు క్యాష్ లెస్ వైద్య సాయం అందేలా హెల్త్ స్కీం, నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యగాల కల్పన అనే పథకాలను ప్రవేశపెట్టారని వాటిని కూడా కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తుందన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాని, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో, అధిక ధరలు, నిరుద్యోగంతో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. మన పెద్దపల్లి నియోజకవర్గంలో, పార్లమెంటు పరిధిలో గడ్డం వంశీ కృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరిని కోరారు. మళ్ళీ తిరిగి సంతోష వంతమైన ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మే 13 న హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మన పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, వారి నాయకులు ఇసుక, మట్టి మాఫీయా చేసి ప్రజా సంపదను, రైతులను తాలు పేరిట అడ్డగోలుగా దోచుకున్నారని అన్నారు. కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తరుగు పేరిట నిలువు దోపిడీ అనేది లేకుండా, వడ్ల కటింగ్ లేకుండా రైతులందరికీ మేలు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. బి.ఆర్.ఎస్, బిజెపి పార్టీల వారికి ప్రజలందరూ ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.