పెద్దపల్లి జిల్లా సదాశయ నూతన కమిటీ నియామకం

కమాన్ పూర్
సిరా న్యూస్,పెద్దపల్లి జిల్లా;
సదాశయ ఫౌండేషన్
జిల్లా నూతన కమిటీ ఎన్నిక సోమవారం జరిగింది.
– అధ్యక్షులుగా ఏ. రాజమౌళి
– ప్రధాన కార్యదర్శిగా ఎల్.రాజమౌళి
– గౌరవ అధ్యక్షులుగా ఎల్.చంద్రమౌళి
– కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు

నేత్ర, అవయవ, శరీర దానం పై విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తూ, ప్రజలను చైతన్యవంతం చేస్తున్న సదాశయ ఫౌండేషన్ సంస్థ సేవలను మరింత విస్తృత పరచడం కోసం కొత్త కమిటీల నియమకాలపై దృస్థి సారించింది. ఇందులో భాగంగా సోమవారం గోదావరిఖని శారదా నగర్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రావణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఏ.రాజమౌళి, గౌరవ అధ్యక్షులుగా ఎల్.చంద్రమౌళి, మహిళా అధ్యక్షురాలిగా వి.కవిత, ప్రధాన కార్యదర్శిగా ఎల్.రాజమౌళి, ఉపాధ్యక్షుడుగా ఎస్.ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శిగా ఎల్.రాజలింగయ్య, సహా కార్యదర్శిగా సీఎచ్.యోగేష్, సభ్యుడిగా జి.సమ్మిరెడ్డి, సలహదారులుగా నల్లవెల్లి శంకర్, దేవి లక్ష్మీనర్సయ్య, వైద్య సలహదారులుగా డాక్టర్ సందీప్ ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… ముడమ్మకాలు, అపోహాలు వీడి ప్రజలంతా నేత్ర, అవయవ, శరీర దానాలు చేసేలా అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో సదాశయ సేవలను విస్తృత పరచాలని, ఫౌండేషన్ లో కొత్త సభ్యులను చేర్పించాలని సూచించారు. అనంతరం కొత్త కమిటి కార్యవర్గంతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు ఆనంతరములు, కే. ఎస్.వాసు, శారదా, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *