సిరాన్యూస్, సామర్లకోట
పెద్దాపురంలో కొనసాగుతున్న బంద్
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పును నిరసిస్తూ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత్ బంద్ బుధవారం పెద్దాపురంలో ఉదయం నుంచి ప్రారంభమైంది. ఆర్టీసి బస్టాండ్ వద్ద బస్సులు బయటకు రాకుండా గేటు వద్ద బైటాయించి నిరసన చేపట్టారు. బంద్ పిలుపు ఉండటంతో బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. బంద్ నేపద్యంలో ముందుగానే విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి.