పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ గడ్డం వంశీకి ఇవ్వాలి

సిరా న్యూస్,పెద్దపల్లి;
యువనేత గడ్డం వంశీకి బీసీ పోరాట సమితి మద్దతిస్తుందని బిసి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షలు మహేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ‌ఇవ్వాలని అదిస్టానాన్ని కోరుతున్నామ న్నారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని వంశీకృష్ణకి ఇస్తే పార్లమెంటు పరిధిలో పరిశ్రమలు, నిరుద్యో గులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయ న్నారు. వంశీకృష్ణ తన తాత ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాడని పేర్కొ న్నారు. విశాఖ ట్రస్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. గత 50 ఏళ్ళుగా పె

ద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి అంతా కూడా కాకా వెంకటస్వామి, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ హయాంలోనే జరిగిందన్నారు. వంశీకృష్ణకు టికెట్ ఇచ్చినట్లయితే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలువాక రాజయ్య, నాయకులు భూషణవేని సురేష్ గౌడ్, దొడ్డుపల్లి జగదీష్, తూముల మహేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *