సిరా న్యూస్ నిర్మల్(పెంబి):
సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి వెళ్లిన పెంబి నాయకులు…
హైదరాబాద్ పట్టణంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలం నుండి కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్న విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ హై కమాన్ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెంబి మండల అధ్యక్షులు సల్ల స్వప్నీల్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది సల్ల ప్రశాంత్ రెడ్డి, జవహర్ బాల మంచ్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు తులాల శంకర్, వార్డ్ సభ్యులు గుగ్గిళ భుమెష్, భూక్యా సుభాష్, తదితరులు పాల్గొన్నారు.