సిరా న్యూస్, పెంబి:
పెంబిలో అక్షింతలతో శోభాయాత్ర
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఇంటింటికి అయోధ్య రామాలయం అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం హరిహర క్షేత్రంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయ అక్షింతలను, రాముని చిత్రపటాలను పల్లకిలో ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం పలువురు భక్తులు మాట్లాడుతూ.. రామ ప్రాణ ప్రతిష్ఠ గావింపబడిన అక్షింతలను ప్రతీ ఇంటికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్ గౌడ్, నాయకులు చల్ల రామేశ్వర్ రెడ్డి, పుప్పల నర్సయ్య, తులాల రాజలింగు, గన్నారపు సురేష్, ఆమడ శంకర్, ఇతర భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.