సిరాన్యూస్, ఓదెల
పెండెం నాగేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మిత్రులు
స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా అని నిరూపించారు ఓదెల మండలానికి చెందిన స్నేహితులు.పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోనీ నిరుపేద కుటుంబానికి చెందిన పెండెం నాగేష్ ఇటీవలే మరణించారు. సోమవారం నాగేష్కు చెందిన స్నేహితులు రూ.20 వేల రూపాయలు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లం సతీష్, రాష్ట్ర ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత ఇరుకుల్ల వీరేశం, డాక్టర్ క్యాతం సంతోష్, జక్కుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాట్సాప్ స్టేటస్ చూసి ఆర్థిక సహాయం అందించిన మిత్రుల అందరికీ అల్లం సతీష్. ఇరుకుల్ల వీరేశం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.