హుస్సేన్ పురంలో పెన్షన్ కార్యక్రమం

సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా హుస్సేన్ పురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం గ్రామంలో పండగ వాతావరణం లో జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బందితోపాటు తెలుగుదేశం , జనసేన నాయకులు , కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎన్నికల టైం లో మాటిచ్చిన ప్రకారం 3000 పెన్షన్ 4000 చేసి ఇస్తున్నారని గ్రామ ప్రజలకు పెన్షన్ దారులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చల్లా బుజ్జి, కోట అప్పారావు , చల్లా వెంకటరమణ , పుప్పాల సాయి ,పలివేల చంద్రశేఖర్ , గుడాల గణేష్ ,కాకరపల్లి లోవరాజు ,తలారి శ్రీనివాసరావు , నొక్కు రమణ ,బుంగ బాలరాజు పంచాయతీ సెక్రెటరీ కర్రీ శ్రీనివాసరావు , వెల్ఫేర్ ఆఫీసర్ వింజమూరు ఆచార్య , గ్రామ పెద్దలు ,యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *