కొత్త డ్రామా కు తెరలేపిన జగన్ ప్రభుత్వం
ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసిన తెదేపా
నందికొట్కూర్ టిడిపి అభ్యర్థి గిత్త జయసూర్య
సిరా న్యూస్,నందికొట్కూరు ;
ఫించన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13వేల కోట్లు సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, ఖజానా ఖాళీ కావడంతో జగన్ ప్రభుత్వం మరో కొత్త డ్రామాకి తెరలేపారని నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిత్త జై సూర్య మండిపడ్డారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ఈ ఓ ఆర్ డి కి పెన్షన్లు పంపిణీ చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిత్త జయ సూర్య మాట్లాడుతూ పట్టణ ,గ్రామీణ ప్రాంతాలలోని సచివాలయ సిబ్బందితో పెన్షన్ దారులందరికీ ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు 13వేల కోట్ల రూపాయల నిధులు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన ఘనుడు ఈ జగన్ మోహన్ రెడ్డి అన్నారు .పెన్షన్ నిధులను దారి మళ్లించి టిడిపి పార్టీపై నిందలు వేయడం విడ్డురంగా ఉందన్నారు .టిడిపి పార్టీ తరుపున మేమంతా కోరుకుంటున్నది ఒక్కటే వాలంటీర్ వ్యవస్థను దూరం పెట్టి, సచివాలయ సిబ్బందితో ఇంటికి వెళ్లి పెన్షన్ దారులకు పెన్షన్ లను అందించాలని తెలియజేశారుపేదలపై అంత ప్రేమ ఉన్న జగన్ రెడ్డి ఏప్రియల్ 1వ తారీఖు నుంచే ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేయాలని ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని ప్రశ్నించారు. ఒకటో తారీఖున ఫించన్లు ఇవ్వాల్సిన డబ్బును మరియు జనవరి 23న బటన్ నొక్కిన ఆసరా డబ్బును, ఫిబ్రవరి 16న బటన్ నొక్కిన చేయుత డబ్బును, ఫిబ్రవరి 29న పామర్రులో బటన్ నొక్కిన విద్యా దీవెన డబ్బును, మార్చి 14న బటన్ నొక్కిన ఈబీసీ నేస్తం డబ్బును, ఆరోగ్యశ్రీ కి ఇవ్వాల్సిన నిధులు రూ.13 వేల కోట్లు, మార్చి 16 నుంచి 30వ తారీఖు లోపల అంటే 15 రోజుల్లోనే జగన్ రెడ్డి తన అనుకూల కాంట్రాక్టర్లకు మొత్తం దోచిపెట్టారని, దీంతో ఫించన్లు ఇవ్వడానికి నేడు ఖజానాలో సరిపడా నిధులు లేవన్నారు. అందుకే తన దుర్మార్గాన్ని కప్పిపెట్టుకోవడానికి జగన్ రెడ్డి ఎన్నికల కమీషన్ పైనా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన, టీడీపీ పైన దుష్ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పోతుల రఘురామిరెడ్డి, మైనార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
=================================