People: ప్రజల పక్షాన ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి..

 సిరా న్యూస్ర్ కుందుర్పి : తెలుగు న్యూస్

ప్రభుత్వ పథకాలు అందకుంటే ప్రజల పక్షాన ప్రశ్నించడమే లక్ష్యం

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు కురుబ ముక్కన్న పేర్కొన్నారు. పోస్టల్ ఉద్యోగిగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించడమే లక్ష్యంగా సమాజ హితం కోసం రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. తాను సాటి మనిషికి మానవత్వంతో సహాయం చేయాలని ఉన్నతాశయంతో వికలాంగురాలైన మహిళను ఆదర్శ వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో రాజకీయ నాయకుల ఊబిలో చిక్కుకుని అమాయకంగా మోసపోతున్న ప్రజలకు బాసటగా నిలిచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే లక్ష్యంతోనే  ముందుకొచ్చానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *