ఎన్నికల ఫలితాలను వీక్షించడానికి ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుపై ప్రజల హర్షం

సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి,
పార్లమెంటు ఎన్నికల ఫలితాలను వీక్షించడానికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ లో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను, అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలను ప్రదర్శన నిర్వహించారు. అధికారులు ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడంపై భూపాలపల్లి పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టిన నేపథ్యంలో భూపాలపల్లి పట్టణ ప్రజలు ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు వీలుగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు ఎల్ఈడి స్క్రీన్ తో పాటు టెంట్లు, కుర్చీలు, మంచినీరు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచినట్లు డిపిఆర్వో శీలం శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలను వీక్షించడానికి వచ్చిన ప్రజలు మాట్లాడుతూ
ఎన్నో పనులలో దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు, రోడ్లపై చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే చిరువ్యాపారులు, ఆటో కార్మికులకు, వాహన దారులకు పార్లమెంటు ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ప్రజలు సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ఎల్.ఈ.డి స్క్రీన్ ,టెంట్లు,కుర్చీలు, మంచి నీరు, అత్యవసర మందులు ఏర్పాటు చేసి దూర ప్రయాణాలు చేసే వారికి సామాన్యులకు దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను వీక్షణకు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ప్రజలందరితో కలిసి చూడడం చాల ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *