People are worried about mosquito invasion : దోమల దండయాత్రతో బెంబేలెత్తుతున్న జనం

సిరా న్యూస్,కర్నూలు;

కర్నూల్ నగరంలో దోమల దండయాత్ర తో జనం బెంబేలెత్తుతున్నారు. గత 20 రోజులుగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా మారింది. నగరంలోని మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంజ్ నగర పరిసరాల్లో ఉన్న హంద్రీ, కేసీ కాలువ, తుంగభద్ర నదులలోని నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల ఉధృతి అధికంగా కనిపిస్తుంది. కర్నూల్ నగరంలో సాయంత్రం అయితే చాలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో దోమల దండయాత్ర ప్రారంభమవుతుంది. దీంతో నగర ప్రజలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితిలో నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా కర్నూలు నగరంలో దోమల ఉద్ధృతి అధికంగా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగరంలోని చాలా ప్రాంతాలలో మురికినీటి కాలువలను తరచూ శుభ్రం చేయకపోవడంతో పాటు ఈ ఏడాది వర్షాలు కూడా తక్కువగా ఉండడంతో కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్న హంద్రీ, తుంగభద్ర నదుల్లో నీరు నిలిచి దోమలు అధికమయ్యాయి. నగరంలో దోమల బెడదపై అధికార యంత్రాంగానికి ఎన్నిసార్లు విన్నవించిన సరైన సమయంలో స్పందించలేదని విమర్శలు వెళ్ళు వెతుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో దోమలు ఒక్కసారిగా విస్తరించి జనం బయటికి రావాలని భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని ప్రధాన రహదారులతోపాటులో దోమ కాటుకు గురై జనం విలవిలలాడిపోతున్నారు. ఒకసారిగా దోమల బెడద తీవ్రం కావడంతో నగరపాలక సంస్థ అధికారులు నివారణ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా దోమల విస్తరణకు కారణంగా భావిస్తున్న నగరంలోని హంద్రీ తుంగభద్ర నదిలోని నీటిలో మొలిచిన గుర్రపు డెక్కల ఆకును తొలగించే కార్యక్రమాన్ని విస్తృతం చేశారు .నాటు పడవలను ఉపయోగించి నిలిచిన నీటిలో పెరిగిన గుర్రపు డెక్కల ఆకులను తొలగిస్తున్నారు. అలాగే దోమల ఆవాస ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులు ఫాగింగ్ చేస్తూ దోమలను నివారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దోమలను నివారించేందుకు నగరపాలక సంస్థ అధికారులు తీసుకుంటున్న చర్యలను నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తూ అవసరమైన సూచనలు సలహాలు చేస్తున్నారు. గత వారం రోజులుగా నగరపాలక సంస్థ అధికారులు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ దోమల బెడద అలాగే కొనసాగుతున్నంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని చాలా ప్రాంతాలలో దోమకాటుకు గురై ప్రజలు అస్వస్థకు గురై ఆసుపత్రులకు పరిగెత్తుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమలు పెడతాను పూర్తిగా నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *