పంచకర్ల నామినేషన్ కు పోటెత్తిన జనం

 సిరా న్యూస్,పెందుర్తి;
ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన టిడిపి బిజెపి పార్టీలకు చెందిన వేలాదిమంది నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. పెందుర్తి అర్బన్ తోపాటు సబ్బవరం పరవాడ మండలాల నుండి వందలాది వాహనాలతో మహిళలు యువకులు వచ్చారు. పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడలి నుండి వేపగుంట వరకు రోడ్డుకిరువైపులా జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది. వేపగుంట కూడలి నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం సుజాతనగర్ చిన్నముషిడివాడ మీదుగా చేరుకుంది. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణ గా నిలిచాడు. అభ్యర్థి రమేష్ బాబు తో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి, రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గం కన్వీనర్ గొర్లే రామునాయుడు, కార్పొరేటర్లు బల్ల శ్రీనివాసరావు సేనాపతి వసంత్ శంకర్రావు రాపర్తి కన్నా పీల శ్రీనివాసరావు ముల్లి ముత్యాల నాయుడు మూడు పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *