పెరిగిన ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జడ్పిటిసి లింగమల శారద దుర్గయ్య
 సిరా న్యూస్,మహా ముత్తారం;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల పరిధిలోని గ్రామాల ప్రజలు పెరిగిన ఎండలతో అప్రమత్తంగా ఉండాలని జెడ్పిటిసి లింగంపల్లి శారద ఓ ప్రకటనలు సూచించారు ఎండల తీవ్రత ఎక్కువగాఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకొని అధిక ఉష్ణోగ్రతల నుండి తమను తాము కాపాడుకోవాలని అన్నారు.ఎండలు ముదరడంతో ప్రజలు ఉదయం 11 గంటల వరకే తమ పనులు ముగించుకోనీ ఇంటి వద్దనే ఉండాలిమధ్యాహ్నం 4 గంటల తర్వాత మళ్లీ బయటకు రావాలి, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప 11 గంటల నుంచి 4 గంటల వరకు బయట తిరగవద్దు, సాధ్యమైనంత వరకు నీడలో ఉండాలి శరీరానికి సరిపడా నీటినితీసుకోవాలి. రైతులు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కూలీలు బాలింతలు చిన్నపిల్లలు వయోవృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.బయటకు వెళ్ళేటప్పుడు తలపాగా కానీ టోపీ గాని ధరించి వెళ్లాలి. శరీరాన్ని డిహైడ్రేట్ చేసే ఆల్కహాల్ కాఫీ టీ కూల్ డ్రింక్ అధిక ప్రోటీన్ ఉప్పు కారం నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు,వేసవి ఎండ తీవ్రత నుండి వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనిఅన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *