తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు భాగస్వాములు అవుతారు

మంథని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలతో మంత్రి శ్రీధర్ బాబు సరదాగ కబుర్లు
 సిరా న్యూస్,మంథని;

తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు భాగస్వాములు అవుతారని ,కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని చౌరస్తాలోని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళుతున్న ప్రజలతో మంత్రి శ్రీధర్ బాబు కాసేపు సరదాగా మాట్లాడారు. అక్కడే ఉన్న ఓ పాన్ షాప్ లో శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ స్వీట్ పాన్లు తిని ప్రజలతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆరు గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళుతుందన్నారు. మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రంగం పనిచేస్తుందని,ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ పరిపాలనకు కొంత స్తబ్దత ఏర్పడిందని పేర్కొన్నారు. ఓటర్ల సరళిని చూస్తే పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *