సిరా న్యూస్,కరీంనగర్;
ఐఐటి- జేఈఈ (మెయిన్)-2024 మొదటి విడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేయబడ్డాయి. ఈ ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభతో జాతీయస్థాయిలో అత్యద్భుత పర్సంటైల్ సాధించారు. బి.అదిత్యారావు 99.85 పర్సంటైల్తో అగ్రస్థానంలో నిలువగా, జి.శ్రీహాస్ 99.74, సుబోద్ చౌధరి 99.59, యమ్. శ్రీరామ్ 99.42, ప్రణీత్ 99.20, నిఖేశ్ చోప్రా 99.08. ఏ. శివవరుణ్ 99.05, సీహెచ్, అనూహ్య 98.99, పి.రఘువీరారెడ్డి98.96, యెస్ సత్య అమూల్య 98.95, విశాల్ రెడ్డి 98.94, షఫీక్ 98.94, శివశంకరవరప్రసాద్ 98.91, శ్రీనిధి 98.83, యమ్.ప్రహార్ష్ 98.83, పునీత్ మనోహర్ 98.83, రవిచంద్ర 98.42, కార్తిక్ 98.19 సాధించారు. అనేక మంది విద్యార్థులు 90 అ పై పర్సంటైల్ సాధించడం విశేషం. రెండవ విడత ఫలితాలలో కూడ మా అల్ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, పర్యవేక్షణ, విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘనవిజయం సాధించడం జరిగిందని. రాబోయే ఐఐటి అడ్వాన్స్, నీట్, ఎంసెట్ లో కూడ మా అల్ఫోర్స్ చిన్నారులు అధ్బుత ర్యాంకులు సాధిస్తారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విశ్వసించారు. ఐఐటి- జేఈఈ (మెయిన్)-2024 ఫలితాలలో అద్భుత పర్సంటైల్ సాధించిన మా అల్ఫోర్స్ ఆణిముత్యాలను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.
ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.