సిరా న్యూస్;
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. ఈమేరకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రపంచంలోని అగ్ర దేశాలతో భారత్ జరుపుతున్న సంప్రదింపులు.. గడిచిన పదేళ్లలో భారత్ సాధించిన ఆర్థిక ప్రగతి చూసి.. అనేక దేశాలు భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నాయి. ఇటీవలే అమెరికా కూడా భారత్కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలిపింది. తర్వాత ఫ్రాన్స్, తాజాగా యూకే కూడా భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించాయి. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసపెంబ్లీ 79వ సాధారణ చర్చను ఉద్దేశించి మాట్లాడిన బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ యూఎన్సీసీ మరింత ప్రాతినిధ్య సంస్థగా మారాలన్నారు. ఇందులో భాగంగానే యూకే పలు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతోందని తెలిపారు. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆఫ్రికన్ దేశాల ప్రాతినిధ్యం కూడా చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించారుఇక అంతకు ముంద ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ కూడా మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు తాము మద్దతు ఇస్తామని తెలిపారు. భద్రతా మండలిని విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఫ్రాన్స్ అనుకూలంగా ఉందని తెలిపారు. ఆఫ్రికాలోని రెండు దేశాలతోపాటు జపాన్, జర్మనీ, ఇండియా, బ్రెజిల్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.ఇక గతవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా మద్దతు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈమేరకు భారత ప్రధాని నరేంద్రమోదీకి స్వయంగా హామీ ఇచ్చారు. మూడు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన మోదీ.. బైడెన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు.ఇదిలా ఉంటే.. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న మూడు కీలక దేశాలు అమెరికా, యూకే, ఫ్రాన్స్.. భారత్కు శాశ్వత సభ్యత్వం విషయంలో మద్దతు ఇవ్వడం శుభ పరిణామంగా చెప్పవచ్చు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.భద్రతా మండలి ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఏర్పడి దాదాపు 75 ఏళ్లు అవుతోంది.ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నారు. మిగతా దేశాలు తాత్కాలిక సభ్యులుగా రొటేషన్ పద్ధతిలో మారుతుంటాయి.భారత్ అనేక సంవత్సరాలుగా శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతుండగా, ఐదు శాశ్వత దేశాల్లో నాలుగు దేశాలు మాత్రం భారత్కు మద్దతు ఇస్తున్నాయి. గతంలో ఫ్రాన్స్ ఒక్కటే మద్దతు ఇచ్చింది. అమెరికా, బ్రిటన్, చైనా వ్యతిరేకించాయి. ప్రస్తుతం భద్రతామండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు, పది తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి రెండేళ్లకోసం ఎన్నుకోబడతాయి. శాశ్వత సభ్య దేశాలుగా రష్యా, అమెరికా, ప్రాన్స్, యూకే, చైనా ఉన్నాయి. ఐదు దేశాల్లో నాలుగు దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. ఇక శాశ్వత సభ్య దేశాలకు ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఉంది.ఐరాస భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కోసం చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆ ప్రతిపాదన వచ్చిన ప్రతీసారి చైనా వీటో చేస్తుంది. దీంతో ఇండియాకు శాశ్వత సభ్యత్వం లభించడం లేదు. అయితే ఈ సంవత్సరం శాశ్వత సభ్యులుగా ఉన్న 5 దేశాలలో మూడు దేశాలు.. అమెరికా, ఫ్రాన్స్, యుకె ఇండియాకు శాశ్వత సభ్యత్వం కోసం మద్దుతు తెలిపాయి. యుకె ప్రధాని కంటే ముందు అమెరికా, ఫ్రాన్స్ దేశాల ప్రెసిడెంట్లు జో బైడెన్, ఎమానుయెల్ మాక్రాన్ కూడా ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని అన్నారు. యుకె ప్రధాని కంటే ఒక్కరోజు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానెయెల్ మాక్రాన్ ఐరాస భద్రతా మండలిలో భారత్ కు సభ్యత్వం కల్పించాలని గట్టిగా వాదించారు. ఆయన బుధవారం సమావేశాల్లో మాట్లాడుతూ.. ”భద్రతా మండలిలో అడ్డంకులు ఉన్నంత కాలం మనం ముందుకు సాగలేం. ఐకరాజ్య సమితిని సమర్థవంతంగా చేయాలంటే ముందు భద్రతా మండలి మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఫ్రాన్స్ ఇదే చెబుతోంది. జర్మనీ, జపాన్, ఇండియా, బ్రెజిల్ దేశాలు, ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలి.” అని మాక్రాన్ అన్నారు.అంతకుముందు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో క్వాడ్ దేశాల సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ఇదే మాట అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమస్యలు వస్తే.. వాటిని పరిష్కరించేందుకు ఇండియా ఎప్పుడూ ముందు ఉంటుంది. కరోనా సమయంలో ఇతర దేశాలకు భారత్ అందించిన సాయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. భారతదేశానికి ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించే అవసరం ఉందన్నారు. భారత్కు ఎల్లప్పుడూ అమెరికా అండగా ఉంటుందని తెలిపారు.