రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మార్వో కు గంగాధర బీజేపీ నాయకుల వినతిపత్రం

సిరా న్యూస్,చొప్పదండి;
రైతులు పడుతున్న ఇబ్బందులపై రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బిజెపి నాయకులు సోమవారం గంగాధర ఎమ్మార్వో కు వినతి పత్రాన్ని ఈ సందర్భంగా బీజేపీ చొప్పదండి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందడానికి నిరసనగా గంగాధర ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లు ప్రారంభమైనందున 2 నెలలు పూర్తి అవుతున్న వడ్ల కొనుగోలు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అకాల వర్షాల వలన వడ్లు కొనుగోలు ఆలస్యం కావడం వలన రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకోలేక వడ్ల కొనుగోలు కేంద్రాలలోనే మొలకలు ఎత్తే పరిస్థితి వచ్చిందని అన్నారు.
క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలని ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతోపాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానక్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్ ను ఏర్పాటు చేయాలని సమగ్ర పంటల బీమాన అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలని అన్నారు.కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలని గంగాధర మండల బిజెపి శాఖ ద్వారా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ మండల ప్రధాన కార్యదర్శులు పంజాల ప్రశాంత్ గౌడ్,రేండ్ల శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు వొడ్నాల రాజు, సామల మహిపాల్,మండల అధికార ప్రతినిధి సర్వ శ్రీనివాస్, మండల దళిత మోర్చా అధ్యక్షులు తాళ్ల రాజశేఖర,కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు కట్ల శ్రీనివాస్,బిజెపి సీనియర్ నాయకులు జారతకొండ మహేష్, పెరుక శంకర్,మండల గౌడ సెల్ అధ్యక్షులు పరశురాములు గౌడ్,బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *