సిరా న్యూస్,జగిత్యాల;
ఫోటో గ్రాఫర్ రూపంలో వినాయకుడు విగ్రహాన్ని మట్టితో తయారు చేసి పూజించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ వడ్లూరి రవీందర్ తనవృత్తి యైన ఫోటోగ్రఫీ కి చెందిన కెమెరా,లెన్స్ లు కల్గి ఉండి ఫోటో తీసుకున్నట్లుగా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఫోటోగ్రాఫర్ గణేష్ విగ్రహానికి వినాయక చతుర్థి ప్రత్యేక పూజలునిర్వహించారు.పర్యావరణ పరిరక్షణ తో పాటు తన వృత్తిని దైవంగా భావించి కెమెరా గణేష్ తో పాటు కెమెరాలకు పూజలు నిర్వహించినట్లు రవీందర్ తెలిపారు.