సిరా న్యూస్, తలమాడుగు:
ఆధ్యాత్మికతతోనే ప్రశాంతమైన జీవితం
– ఫూలాజీబాబా చూపిన సన్మార్గంలో నడవాలి
– ఫూలాజీ బాబా ధ్యాన కమిటీ అధ్యక్షులు కోటిపల్లి సురేష్ రెడ్డి
ఆధ్యాత్మికతతోనే ప్రశాంతమైన జీవితం గడపవచ్చని ఫూలాజీ బాబా తలమడుగు ధ్యాన కమిటీ అధ్యక్షులు కోటిపల్లి సురేష్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పూలాజి బాబా ధ్యాన మందిరంలో నిర్వహించిన ఫూలాజీబాబా పుణ్యతిథి కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా బాబా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సద్గురు పరమహంస శ్రీ ఫూలాజీబాబా చూపిన సన్మార్గంలో ప్రతిఒక్కరు నడుచుకోవాలని పేర్కొన్నారు. ధాన్యం చేయడంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. కరోనా లాంటి మహమ్మారి కూడా దరిచేరదన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు నీలగిరి అశోక్, సభ్యులు రాధాబాయి, భూమన్న, మీనాక్షి, సుమబాయి, పొచన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.