సిరా న్యూస్, జైనథ్
పిప్పర్వాడ టోల్ ప్లాజా లో మేడే వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్ వాడ టోల్ ప్లాజాలో సీఐటీయూ అనుసంధానం టోల్ ప్లాజా కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఎ. సంతోష్, సెక్రెటరీ విలాస్, కోశాధికారి ఎం రాకేష్, టోల్ ప్లాజా కార్మికులు పాల్గొన్నారు.