PipparwadaTollplaza new Body: పిప్పర్‌వాడ టోల్‌ప్లాజాలో కొత్త యూనియన్‌…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

పిప్పర్‌వాడ టోల్‌ప్లాజాలో కొత్త యూనియన్‌…
+ సీఐటీయూ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం
+ అధ్యక్షునిగా అక్నూర్‌ సంతోష్‌
+ సమస్యలు, భవిష్యత్త్‌ కార్యాచరణపై చర్చలు

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని పిప్పర్‌వాడ టోల్‌ప్లాజాలో పనిచేస్తున్న 75మంది సిబ్బంది కొత్త యూనియన్‌ను ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షునిగా అక్నూర్‌ సంతోష్, ప్రధాన కార్యదర్శిగా భౌనే విలాస్, కోశాధికారిగా మన్నే రాకేష్, ఉపాద్యాక్షునిగా మేకల రమేష్‌ యాదవ్, సహాయ కార్యదర్శిగా నరంశెట్టి పురుష్టోత్తంలతో పాటు షేక్‌ లతీఫ్, అర్గుల ఆశన్నలను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం టోల్‌ప్లాజా కార్మికుల సమస్యలు, భవిష్యత్త్‌ కార్యచరణపై చర్చించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ… కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *