PL K Ramachandra Reddy:ఆవులలో పిండ మార్పిడి చేస్తాం

సీరా న్యూస్ భీమదేవరపల్లి

ఆవులలో పిండ మార్పిడి చేస్తాం
*ప్రాజెక్టు పిఎల్ కె రామచంద్ర రెడ్డి

పిండ మార్కెట్ ద్వారా దేశవాళీ దూడలను తెలంగాణలో అభివృద్ధి పరిచేందుకు శాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్నట్టు కోరుట్ల పశువైద్య కళాశాల ప్రధాన ఆచార్యులు, ప్రాజెక్టు పిఎల్ కె రామచంద్ర రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళ సహకార డైరీ సభ్యులకు చెందిన పశువులపై పిండ మార్పిడి పద్ధతులను ప్రయోగించారు.. అనంతరం మాట్లాడుతూ పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల మిషన్ చేపట్టినట్లు తెలిపారు.. రానున్న ఐదు, ఆరు నెలలలో రైతుల ఆవులలో పిండ మార్పిడి చేస్తామని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. ఒకే గ్రామంలో సుమారు 15 ఆవులకు పిండ మార్పిడి చేయాలనుకుంటే శాస్త్రవేత్తలు మీ గ్రామాలకే వస్తారని వెల్లడించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *