సిరా న్యూస్, డిజిటల్:
వైరలవుతున్న నరేంద్ర మోడీ ఫొటోస్…
భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా బీచ్ లో తిరుగాడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లేలేత సూర్య కిరణాలు ప్రసరిస్తుండగా బీచ్ లో నరేంద్ర మోడీ కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫోటోలు ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. లక్షద్వీప్ లోని సహజమైన బీచ్ లలో ఉదయపు నడక, తనకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా బిజెపి నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తుండడంతో మిలియన్ల కొద్ది లైకులు, వ్యూస్ వస్తున్నాయి.