సిరా న్యూస్,వేములవాడ;
: వేములవాడ పట్టణ పరిధిలోని కొనాయపల్లి లో లక్కామారు మున్నూరు కాపు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి దయతో సకాలంలో వర్షాలు పడి రైతులు,ప్రజలు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.ఈ బోనాల కార్యక్రమంలో లక్కామారు మున్నూరు కాపు నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు