సిరాన్యూస్, సైదాపూర్:
ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన : బీఎస్పీ మండల అధ్యక్షుడు పొడిశెట్టి అశోక్
* దళిత మహిళపై జరిగిన దాడిని ఖండించాలి
షాద్నగర్ లో దళిత మహిళపై పోలీస్ స్టేషన్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సైదాపూర్ బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు పొడిశెట్టి అశోక్ అన్నారు. బుధవారం సైదాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇది ప్రజా పాలన కాదని రాక్షస పాలనని, రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిందని చెప్తున్నా రేవంత్ రెడ్డికి బాధిత మహిళపై చేసిన దాడి కనిపించట్లేదా అన్నారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని విధుల నుండి తొలగించకాకుండా, సస్పెండ్ చేయకుండా కాపాడే పనిలో యంత్రాంగం ఉందని విమర్శించారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే రామ్ రెడ్డిని వెంటనే ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలి. అతనిపై మర్డర్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలన్నారు. బాధిత మహిళకు తక్షణ సాయం రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.