సిరాన్యూస్, సైదాపూర్
కరీంనగర్ బహుజన్ ముక్తి పార్టీ ఎంపీ అభ్యర్థిగా పొడిశెట్టి సమ్మయ్య
కరీంనగర్ బహుజన్ ముక్తి పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా సైదాపూర్ మండలానికి చెందిన ఆటో డ్రైవర్ పొడిశెట్టి సమ్మయ్య మంగళవారం హైదారాబాద్ బహుజన్ ముక్తి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు అంసోల్ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ధర్మయ్య, పార్టీ నేత ప్రభాకర్, అందె ఉషా కన్నా చేతుల మీదుగా బీఫాం అందుకున్నారు. అయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా ప్రజలు పార్లమెంటు సభ్యుడిగా అందరూ తప్పకుండా గెలిపించాలని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిరుపేద కుటుంబాలకు చేసింది ఏమీ లేదని, అసలైన అభివృద్ధి బహుజన్ ముక్తి పార్టీ వచ్చిన 150 రోజుల్లోనే చేసి చూపిస్తామని అన్నారు.