భయాందోళనలో గ్రామస్తులు
సిరా న్యూస్,పెద్దాపురం;
మండల పరిధిలోని పలు గ్రామాల్లో విషజ్వరాలు వణికిస్తున్నాయి. గడచిన నెలరోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు విషజ్వరాల బారిన పడి మృత్యువాతకు గురయ్యారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖాధికారులు గోప్యం గా ఉంచడంతో అంతర్యాం తెలియరాలేదు. తిరుపతి, దివిలి, గ్రామాలకు చెందిన జాన్ విక్టర్ (14), వి.కృపారావు (16), పి. హేమసత్యశ్రీ (10) మృతి చెందారు. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పారిశుధ్యలోపం, విషజ్వ రాలపై అవగాహనలేమి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. వైరల్ జ్వరాలపై గ్రామాల్లోఅవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.