సిరా న్యూస్,రంగారెడ్డి;
రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని అత్తాపూర్, హాసన్ నగర్ ప్రాంతాల్లో డీసీపీ చింతమనేని శ్రీనివాస్ సారధ్యంలో పోలీసుల నాకాబంది నిర్వహించారు.150 మంది సిబ్బందితో పోలీసుల కార్డెన్ సర్చ్ జరిగింది. నాలుగు బెల్ట్ షాపులను గుర్తించారు. 29 లీటర్ల మద్యం, ఆటోలో తరలిస్తున్న 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 90 వాహనాలు సీజ్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు.