సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ, ఎఎస్పి, ఒయస్డి ఆదేశాల మేరకు రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛ గా వినియోగించు కోవడానికి చర్ల పోలీస్, సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ ఆధ్వర్యంలో చర్ల ప్రధాన రహదారిపై ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఓటు హక్కు ని అందరూ వినియోగించుకొని సమర్ధవంతంమైన నాయకున్ని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా చర్ల సిఐ రాజువర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల పోలీస్, సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అధికారులు, ఎస్సై నర్సిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.