సిరా న్యూస్,శ్రీకాకుళం
సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కు కేంద్ర పోలీసు దళం ఆర్ పి ఎఫ్ కంపెనీ చేరుకుంది.పోలీసు దళాలు జిల్లాకు వచ్చిన సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ ఫ్లాగ్ మార్చ్ లో కేంద్ర పోలీసు దళాలతో పాటు జిల్లా పోలీసులు పాల్గొన్నారు.ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు,జిల్లా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక తెలిపారు.