సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైలం పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీశైలంలో స్దానికులను పోలీసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది.శ్రీశైలం పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శివశంకర్ రెడ్డి ఇవాళ తెల్లవారుజామున సుమారు ఐదుగంటల సమయంలో స్టేషనులోని రెస్ట్ రూములో సర్వీస్ గన్ తో తలకు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీశైలం పోలీసులు చర్చించుకుంటున్నారు.కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి స్వగ్రామం కర్నూలుగా పోలీసులు గుర్తించారు.అయితే ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు విచారణ చేస్తున్నారు కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి 2001వ బ్యాచ్ గా పోలీసులు తెలిపారు.శివశంకర్ రెడ్డి ఆత్మహత్య తెలుసుకున్న వార్త తెలియగానే శ్రీశైలం పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు సిఐ ప్రసాదరావు హుటాహుటిన స్టేషను కు చేరుకుని ఘటన స్దలాన్ని పరిశీలించారు.మృతి చెందిన శివశంకర్ రెడ్డి కుటుంభికులకు సమాచారం తెలిపారు విషయాన్ని ఉన్నతస్దాయి అధికారులకు తెలిపామని సిఐ అన్నారు. శివశంకర్ రెడ్డి (46) కానిస్టేబుల్ గా శ్రీశైలం పోలీస్టేషన్ లొ విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆత్మహత్య వీడియోలను చిత్రీకరించేందుకు పోలీసులు మీడియాను నిరాకరించారు.డిఎస్పి శ్రీనివాసరావు శ్రీశైలం చేరుకున్న తరువాత మీడియాను అనుమతిస్తామని సిఐ ప్రసాదరావు అన్నారు.