సిరా న్యూస్, సైదాపూర్
దుద్దేనపల్లీ గ్రామంలో పోలీస్ కవాత్
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లీ గ్రామంలో బుధవారం సిఎస్ఎఫ్ పోలీస్ బృందంతో గ్రామంలో కవాత్ నిర్వహించడం జరిగిందని సైదాపూర్ ఎస్సై జున్ను ఆరోగ్యం తెలిపారు. ఈసందర్భంగా హుజురాబాద్ రూరల్ సిఐ పి వెంకట్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.