సిరా న్యూస్,విజయవాడ;
చాట్ బాట్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందచేసారు.బుధవారం నాడు కమాండ్ కంట్రోల్ లో డిప్యూటి పోలీస్ కమీషనర్లు అధిరాజ్ సింగ్ రాణా, కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు వారి మొబైల్ ఫోన్లను అందించడం జరిగింది.
ఈ సందర్బంగా డిప్యూటి పోలీస్ కమీషనర్లు మాట్లాడుతూ సిటిజన్ ఫ్రెండ్లీ అండ్ రెస్పాన్సివ్ పోలీసింగ్ లో బాగంగా ప్రజల సౌలభ్యం కోసం గత సంవత్సరం జూన్ -6 వ తేదిన చాట్ బాట్ సేవలను ప్రారంభించడం జరిగింది. ఈ సేవలను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 5240 మొబైల్స్ మిస్సింగ్ ఫిర్యాదులు వచ్చినాయి. గతంలో సుమారు 50 లక్షల విలువైన 300 పైగా మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాదీనం చేసుకుని బాధితులకు అందించడం జరిగిందని, ఈ రోజు సుమారు కోటి రూపాయల విలువైన 628 మొబైల్ ఫోన్లను భాదితులకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. నగరంలోని ప్రజలందరూ ఈ చాట్ బాట్ సేవలను విరివిగా ఉపయోగించుకోవాలని తెలియజేసారు.