స్పందన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి ….
విచారణ జరిపి చట్ట పరిదిలో న్యాయం చేస్తాం……
జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి
సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 11-12-2023 ) నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఫిర్యాదిదారులనుంచి 71 ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండీ విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలనిస్పందన ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ,స్పందన పిర్యదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కారం చూపాలనిఆదేశించారు.