సిరా న్యూస్,ఒంగోలు;
ఒక మహిళ తన ఇద్దరు పిల్లల తో కలిసి సముద్రం లో దూకి ఆత్మహత్యకు పాల్పడబోయిన ఘటన చీరాల లో కలకలం రేపింది.బాపట్ల జిల్లా చీరాల వాడరేవు లో పావని అనే మహిళ ఇద్దరు పిల్లలైన 7 ఏళ్ల జి.లక్షిత్ 5 ఏళ్ల జి.శర్విత్ సాయి లతో కలిసి సముద్రంలో మునిగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా గమనించిన ఓ మత్స్యకారుడు ఆమెను తన పిల్లతో సహా కాపాడి మెరైన్ పోలీసులకు అప్పగించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న మెరైన్ పోలీసులు బంధువు లకు సమాచారం అందించి ఆమెను చీరాల రూరల్ పోలీస్టేషన్ లో అప్పగించారు.పావనిని తన భర్త రంగారావు ప్రతి నిత్యం అనుమానిస్తూ మానసింకంగా శారీరకంగా హింస్తుంటాడని వాటిని తట్టుకోలేకే తన పిల్లలతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పావనీ చెబుతుంది.