అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ జాగిలం ట్యాంగో

పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో గత 8 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న జర్మన్ షెఫర్డ్, సంతతికి చెందిన పోలీస్ జాగిలం ట్యాంగో అనారోగ్యంతో మరణించినది.జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అధికారులు, పోలీస్ జాగిలం హ్యాండ్లర్ లక్ష్మణ్ తో కలసి ట్యాంగో పై పుష్పగుచ్ఛాలు వేసి ఘనంగా నివాళులర్పించి ట్యాంగో సేవలు మరువలేనివని సంతాపాన్ని వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ..ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ట్యాంగో గత 8 సంవత్సరాల నుండి జిల్లాలో 15 హత్య కేసులలో,84 దొంగతనాలలో మొత్తంగా 99 కేసులలో నిందుతులను , గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించి విధులు నిర్వహించదని కొనియాడారు. 2017 సంవత్సరంలో ట్యాంగో తన హ్యాండ్లర్ లక్ష్మణ్ తో పాటుగా ఎనిమిది నెలల పాటు మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించగా జిల్లాలో 8 సంవత్సరాలుగా సేవలందించిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్, రాజా హ్యాండ్లర్ లక్ష్మణ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *