Poloju Santosh:ముదిమాణిక్యంలో గృహాజ్యోతి అర్హులకు న్యాయం చేయాలి: బీజేపీ నాయకులు పోలోజు సంతోష్

సిరాన్యూస్,చిగురుమామిడి
ముదిమాణిక్యంలో గృహాజ్యోతి అర్హులకు న్యాయం చేయాలి: బీజేపీ నాయకులు పోలోజు సంతోష్

క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడి మండలం ముది మాణిక్యం గ్రామంలో గృహజ్యోతి పథకానికి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు పోలోజు సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడారు. ముదిమాణిక్యం గ్రామంలో 100 మంది ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ చేయకపోవడం వల్ల 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకాన్ని కోల్పోయారని తెలిపారు.గత మూడు నెలలుగా కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుందని..పేదలకు ఉచిత కరెంటు ఇస్తామన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతుందని వాపోయారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని తెలిపారు.రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *