సిరాన్యూస్, హుస్నాబాద్
14న మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష
ఈనెల 14న కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.బీజేపీ కి ప్రజలను ఓట్లు అడిగే నైతికహక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలపై హాట్ కామెంట్స్ చేసారు. ఐదు గ్యారెంటీ ల గురించి విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు పదేళ్ళలో మోడీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు.అధికారంలోకి వచ్చి ప్రభుత్వ సంస్థలన్నీ అమ్ముకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. రాముడు అందరివాడని కేవలం బీజేపీ నేతలకు మాత్రమే కాదని, రాముడిని రాజకీయాల కోసం వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.