సిరాన్యూస్, మానకొండూర్:
కరీంనగర్ లోక్ సభ గొంతు రాహుల్ గాంధీకి వినిపించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
* ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి
* అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం
కరీంనగర్ లోక్ సభ గొంతు రాహుల్ గాంధీకి వినిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ అలుగునూర్ లోని ఉన్నతి కన్వెన్షన్ లో కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మానకొండూరులో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కృషి చేసిన ప్రజలకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మానకొండూరులో కాంగ్రెస్ పార్టీ గెలుపు మీ అందరి సహకారంతోనే కవ్వంపల్లికి 30 వేల మెజారిటీతో మానకొండూరు నియోజకవర్గం ప్రజలు గెలిపించారని తెలిపారు. మానకొండూర్ నియోజకవర్గంలో 316లు బూత్ లు ఉన్నాయని, ప్రతి ఒక్క బూత్ కి భారీ మెజారిటీలు రావాలని కోరారు. కరీంనగర్ కి బిజెపి ఎంపీ బండి సంజయ్ ఏం చేశాడని కనీసం గ్రామాల్లో కూడా వెళ్లలేదని తెలిపారు. ప్రజలను ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నాడని, అదే తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో తిరిగానని బిజెపి పార్టీ ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి, ఈ నియోజకవర్గానికి, ఏం చేసిందని గ్రామాల్లో చర్చ చేయండి అన్నారు. ఈ జిల్లా కాని వ్యక్తి వినోద్ కుమార్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు, పార్లమెంటులో నువ్వే మాట్లాడవో నేను మాట్లాడనో చర్చ చేద్దాం రమ్మన్నారు. మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం , 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల విద్యుత్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని ఆగస్టు 15 లోపు రుణమాఫీ కూడా చేస్తామని వరికి మద్దతు ధర బోనసులు కూడా ఇస్తామని అన్నారు. కరీంనగర్ లోక్ సభ గొంతు రాహుల్ గాంధీకి వినిపించాలన్నారు. కార్యక్రమంలో మానకొండూర్ శాసన సభ్యులు , కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు.