సిరాన్యూస్, హుస్నాబాద్:
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశాలలో భాగంగా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని, ఈ రెండు పార్టీలు అభివృద్ధికి నోచుకుని పార్టీలని, గతంలో కరీంనగర్ జిల్లా ప్రజలు వారిని గెలిపించిన కూడా అభివృద్ధికి నోచుకోలేదు అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు 6 గ్యారంటీల హామీలతో సంతోషంగా ఉన్నారని త్వరలోనే అందరికీ రుణమాఫీ చేస్తామని ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇప్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హుస్నాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ,మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, ఆరెపల్లె మోహన్ , వెలిచాల రాజేందర్, మండల అధ్యక్షులు, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు, హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.