సిరాన్యూస్, చిగురుమామిడి
త్వరలోనే రెండు లక్షల రైతు రుణమాఫీ: మంత్రి పొన్నం ప్రభాకర్
అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించండి
త్వరలోనే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, అత్యధిక మెజారిటీతో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో స్వీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు .ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ గ్యాస్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు.బిజెపి దేశంలో మతవిద్వేషాలు రెచ్చగొడుతుందని 15 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అంబానీ ఆదానులకు మోడీ కట్టబెట్టాలని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులు లూటీ చేస్తుదాని మోడీ అనడం సరికాదని అన్నారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన త్యాగమూర్తి అని అన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చిగురుమామిడి మండలం నుంచి అధిక మెజారిటీ ఇచ్చి ఎంపీ అభ్యర్థినీ గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేశ్వరరావు మాట్లాడుతూ చివరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉంటానని, గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… ఆరు గ్యారంటీలతో ప్రజలకు మేలు జరిగిందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీకి తెలిపినందుకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, దాసరి ప్రవీణ్ కుమార్, కర్ణ కంటి మంజులారెడ్డి, చిట్టి మల్ల రవీందర్, పోలు స్వప్న, భారతి దేవి, మాచమల్ల రమణయ్య, మల్లికార్జున్ రెడ్డి, సత్యం రెడ్డి, వంశీ, నరేష్,కి షోర్ , ఆదర్శ్, బిక్షపతి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.