Ponnam Prabhakar: తడిసిన ప్రతి ధాన్యాన్ని వెంటనే కొంటాం : మంత్రి పొన్నం ప్రభాకర్

సిరా న్యూస్, సైదాపూర్
తడిసిన ప్రతి ధాన్యాన్ని వెంటనే కొంటాం : మంత్రి పొన్నం ప్రభాకర్
* రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దు

తడిసిన ప్రతి ధాన్యాన్ని వెంటనే కొంటామని, రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు మాట్లాడారు.రాష్ట్రంలో కురుస్తున్న వడ గండ్ల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనడానికి ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు.రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని, రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని రైతులకు హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *