Ponnam Prabhakar: మంత్రి  స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయ‌కులు

సిరాన్యూస్‌, సైదాపూర్:
మంత్రి  స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయ‌కులు

సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు వచ్చి చేరుతున్నారు. గురువారం హుస్నాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌లో చేరిన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు సారబుడ్ల రాజిరెడ్డి, మారుపాక తిరుపతి, పరకాల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మూల చంద్రారెడ్డి, కంది ప్రభాకర్ రెడ్డి, ఇజ్జగిరి వెంకటయ్య, అజ్జల చంద్రారెడ్డి, కంది కోమల్ రెడ్డి,సారబుడ్ల లింగారెడ్డి, వెన్నం జితేందర్ రెడ్డి, వెన్నం భగవాన్ రెడ్డి, చింతం మధు, బండ శివానందరెడ్డిలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *