సిరాన్యూస్, చిగురుమామిడి
సామాన్యులతో సామాన్యుడిగా… సుందరగిరి గ్రామస్తులతో మంత్రి పొన్నం చిట్ చాట్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దూసుకెళ్తున్నారు. క్షణం తీరిక లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలను, నాయకులను సమాయత్తం చేస్తున్నాడు. ప్రచారంలో చిన్న విరామం దొరికిన సామాన్య ప్రజలను కలుస్తూ సందడి చేస్తున్నారు. ప్రభుత్వ పాలనను వారికి వివరిస్తున్నారు. రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తో కలిసి ప్రచారం నిర్వహించి హుస్నాబాద్ వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యంలో ఉన్న చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ఒక టీ స్టాల్ దగ్గర ఆగి ప్రజలతో ముచ్చటించాడు. వారితో టీ తాగి వెలిచాల రాజేందర్రావును కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలిపించాలని గ్రామస్తులను కోరారు. అక్కడికి వచ్చిన సామాన్యులతో కలిసి పోయి సరదాగా ముచ్చటించారు.మంత్రితో ఫోటోలు దిగడానికి ప్రజలు పోటీపడ్డారు. గత దశాబ్ద కాలం తర్వాత ఒక మంత్రిని ఇలా దగ్గరగా కలవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని గ్రామస్తులు ముచ్చ టించారు.