Ponnam Prabhakar:ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి

సిరాన్యూస్‌, సైదాపూర్
ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి
* మంత్రి పొన్నం ప్రభాకర్
 * సైదాపూర్ మండలలో ప్రత్యేక పూజలు
రాష్ర్టం ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రవాణా&బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్ర‌వారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సైదాపూర్ మండలలోని ఏగ్లాస్పూర్,గుజ్జులపల్లి గ్రామాలను తెలంగాణ రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుని మహాశివరాత్రి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని గుళ్ళకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని అన్ని సదుపాయాలు వారికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.అలాగే తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. మహిళలు అన్ని రంగాలలో రాజకీయాలలో పూర్తి సార్ధగత సాధించాలని ప్రతి ఒక్కరిని ప్రేరేపించేలా ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *